1. న్యస్తాక్షరి: నాలుగు పాదాల 'మొదటి' అక్షరాలు వరుసగా "శు - క్ర - వా - రం" ఉండాలి. అంశము- వరలక్ష్మీవ్రతము. ఛందస్సు- తేటగీతి.
(వాత్స్యల్యామృతవర్షిణి
వరలక్ష్మీదేవి.)
శుభ్రవస్త్రపు వేదిక సొబగులొలయ
క్రమ్ముకొనియెడి పరిమళకలన తోడ
వాలుకన్నుల వరలక్ష్మి వత్సలతను
రంజనమ్ముగ బడయంగ రండురండు.
2.
న్యస్తాక్షరి: మొదటి పాదం మొదటి గణం మొదటి అక్షరం 'స్వ' , రెండవ పాదం రెండవ గణం మొదటి అక్షరం 'తం', మూడవ పాదం మూడవ గణం మొదటి అక్షరం 'త్ర', నాల్గవ పాదం నాల్గవ గణం మొదటి
అక్షరం 'ము'. అంశము- స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. ఛందస్సు- తేటగీతి.
(భరత మాత)
స్వర్గసీమనుబోలెడి స్వర్ణభూమి
పరులతంత్రముబాపిన భాగ్యభూమి
వేదములు విచిత్రమ్ముగ వెలుగుభూమి
మూడురంగుల కేతన ముగ్ధభూమి.
3.
న్యస్తాక్షరి: అన్ని పాదాల మొదటి అక్షరములు వరుసగా "గు -
రు - పూ - జ" ఉండవలెను. అంశము- ఉపాధ్యాయ దినోత్సవము. ఛందస్సు- తేటగీతి.
(ఆచార్యుని స్వరూప
స్వభావాలు)
గున్నమామిడి రూపమ్ము; వెన్నమనసు;
రుజలు పోగొట్టు చల్లని రుచిరదృక్కు;
పూజ్యతను పెంచు చక్కని పూతనడత;
జన్మజన్మకు మరువము చదువులయ్య!
4. న్యస్తాక్షరి: అన్ని పాదాల మొదటి అక్షరములు వరుసగా "స - ర - స్వ - తి" ఉండవలెను. అంశము- సరస్వతీ స్తుతి. ఛందస్సు- తేటగీతి.
(సరస్వతీ
సాక్షాత్కారం)
సర్వ వాఙ్మయసంపూర్ణసంవిలాస!
రసమయివి నీవు భారతి! రాజితాంఘ్రి!
స్వస్తి కలిగింపరావమ్మ సత్వరమ్ము;
తిమిరసంతతి బాపుము దివ్యవాణి!
5.
న్యస్తాక్షరి: అన్ని పాదాల మొదటి అక్షరములు వరుసగా "అ -
న్న - మ - య్య" ఉండవలెను. అంశము - అన్నమయ్య పదవైభవం. ఛందస్సు- కందంలో.
(పదకవితా పితామహుడు)
అల చందమామ సొగసు,
న్నలినదళేక్షణు మనోజ్ఞనయనపు కాంతుల్,
మలయజపరిమళములు, న
య్య! లయించెను నీపదముల నాదర్శకవీ!
6.
న్యస్తాక్షరి: అన్ని పాదాల యతిస్థానాలలో వరుసగా "క్రొ -
త్త - సా - లు" ఉండాలి. అంశము - నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఛందస్సు- తేటగీతి.
(మా – నవవత్సరం)
గుమ్మపాలను బోలెడి క్రొత్తదారి
ధనికులైనట్టి వారి విత్తమ్ములన్ని
సంఘసౌభాగ్య గతులను సాగుచుండ
లోకమంతట నవినీతి లుప్తమగును.
7.
న్యస్తాక్షరి: అన్ని పాదాల చివరి అక్షరాలు వరుసగా "గ్ర -
హ - ణ - ము" ఉండాలి. అంశము - చంద్రగ్రహణము. ఛందస్సు- తేటగీతి.
(కొడుకు శశిధర్, కూతురు వీణలతో తండ్రి)
సత్యదృష్టి జూడు శశిధరా! పుత్రాగ్ర!
తెలియుమయ్య చంద్రు దివ్యమోహ!
నూటయేబదేండ్లనూత్నత గను వీణ!
నీలి యెరుపు చంద్రు నిండుదనము.
8.
న్యస్తాక్షరి: అన్ని పాదాల మొదటి అక్షరములు వరుసగా "శి -
వ - రా - త్రి" ఉండాలి. అంశము – శివస్తుతి. ఛందస్సు-
తేటగీతి.
(నమో నమో నటరాజ)
శిరము మీదను శశిరేఖ; చేతిలోన
వహ్ని; గళమందు వాసుకి; జహ్ను కన్య;
రాణి శివకామ సుందరి; రమ్య డమరు;
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి